విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగుతున్నాయి. వామపక్షాల, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రాస్తారోకో నిర్వహించారు. ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ రాజమహేంద్రవరంలో ధర్నా చేశారు. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు..
విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ నిర్ణయానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. వామపక్షాల, సీఐటీయూ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో రాస్తారోకో నిర్వహించారు. రాజమహేంద్రవరంలో ధర్నా చేశారు.
protest aginst vishaka steel plant privatization in andhra pradesh