ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రైవేటు పాఠశాలలకు రాయితీలు కల్పించండి : అప్సా - narasannapeta latest news update

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రైవేట్ పాఠశాల అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్దన్ రావు పాల్గొన్నారు. ఆర్థిక భారంతో నిర్వహణ కష్టంగా మారిన ప్రైవేట్ పాఠశాలలకు ప్రభుత్వం పలు రాయితీలు కల్పించాలని డిమాండ్ చేశారు.

Private Schools Association Meeting
నరసన్నపేటలో ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ సమావేశం

By

Published : Jun 16, 2020, 12:25 PM IST

రాష్ట్రంలో ప్రైవేట్ పాఠశాలలను విభజించి బడ్జెట్ పాఠశాలలుగా వర్గీకరించాలని రాష్ట్ర ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ (అప్సా) డిమాండ్ చేసింది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ప్రైవేట్ పాఠశాలల అసోసియేషన్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా అప్సా ప్రధాన కార్యదర్శి మెట్ట జనార్దన్ రావు పాల్గొన్నారు.

చిన్న చిన్న పాఠశాలలను కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పెట్టడం సరికాదన్నారు. ఆర్థిక భారంతో నిర్వహణ కష్టంగా మారిన ప్రైవేట్ పాఠశాలలకు పలు రాయితీలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

ఇవీ చూడండి...

కేంద్రప్రభుత్వ పాలనపై భాజపా కరపత్రాలు విడుదల

ABOUT THE AUTHOR

...view details