శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట మండలం తామరపల్లి సమీపంలో ఓ ప్రైవేటు బస్సు అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. కేరళలో ఎర్నాకుళం నుంచి పశ్చిమ బంగా ముషీరాబాద్కు బస్సు బయల్దేరినట్లు గుర్తించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంలో పలువురు వలస కూలీలు గాయపడ్డారు .
ప్రైవేటు బస్సుకు తప్పిన పెను ముప్పు - ప్రైవేటు బస్సుకు తప్పిన పెను ముప్పు
కేరళలో ఎర్నాకుళం నుంచి పశ్చిమ బంగా ముషీరాబాద్కు బయల్దేరిన ఓ ప్రైవేటు బస్సు శ్రీకాకుళం జిల్లా తామరపల్లి సమీపంలో అదుపుతప్పి ప్రమాదానికి గురైంది . డ్రైవర్ నిద్ర మత్తు కారణంగా బస్సు అదుపు తప్పి రోడ్డు పక్కకు దూసుకుపోయింది. త్రుటిలో తప్పిన ఈ ప్రమాదంలో పలువురు వలసకార్మికులు గాయపడ్డారు.
![ప్రైవేటు బస్సుకు తప్పిన పెను ముప్పు ప్రైవేటు బస్సుకు తప్పిన పెను ముప్పు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7425895-371-7425895-1590983224908.jpg)
ప్రైవేటు బస్సుకు తప్పిన పెను ముప్పు
బస్సులో ఐదుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలతో పాటు 37 మంది ప్రయాణిస్తున్నారు . ప్రమాద సమాచారం తెలిసిన వెంటనే హైవే అంబులెన్స్ అక్కడకు చేరుకుని గాయపడిన వారికి ప్రథమ చికిత్స అందించారు. ఘటనస్థలికి చేరుకున్న నరసన్నపేట తహసీల్దార్ ప్రవల్లిక ప్రియ వారికి భోజన వసతి సదుపాయాలు కల్పించారు . వారందరినీ పశ్చిమబంగాకు పంపించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.