శ్రీకాకుళం జిల్లా బంటుపల్లిలోని ఉన్న యునైటెడ్ బ్రేవెరీస్ పరిశ్రమ (యూబీ)లో పనిచేస్తున్న దారపురెడ్డి వెంకటరావు అనే కార్మికుడు ఇటీవలే అనారోగ్యంతో మృతి చెందాాడు. అతడి కుటుంబ సభ్యులకు సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు ఆర్ధిక సహాయం అందించారు.
అంతా ముందుకు వచ్చి..
తమతో పనిచేస్తూ అనారోగ్యంతో మృతి చెందిన వెంకటరావు కుటుంబాన్ని ఆదుకోవడానికి పరిశ్రమలో పనిచేస్తున్న ఒప్పంద కార్మికులు అంతా ముందుకు వచ్చి ఆర్ధిక సహాయం అందించారు. కార్మికులందరికీ పూర్తి స్థాయిలో పనిదినాలు లేకపోయినా తమకు వచ్చిన కొద్దిపాటి జీతం నుంచే ప్రతి ఒక్కరూ తమ ఒక్క రోజు వేతనం విరాళంగా వసూలు చేసి మొత్తం రూ. 2,19,760 లక్షలు పోగు చేశారు.
మృతుడి భార్యకు అందజేత..