ఏనుగుల గుంపు బీభత్సం.. ఆందోళనలో ప్రజలు
శ్రీకాకుళం జిల్లా ఘన్సారాలో ఏనుగుల గుంపు చెరుకు తోటను ధ్వంసం చేసింది. అదే మండలంలోని తాళ గ్రామ సమీపంలోని ఏనుగులు ఓ ఆవాసాన్ని నేలమట్టం చేశాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల గుంపును అక్కడి నుంచి తరలించాలని అటవీ అధికారులను కోరుతున్నారు.