ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

Minister Appalaraju: పలాసలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం.. ఏమైందంటే? - people stops the vehicle of minister appalaraju in palasa srikakulam

Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో కొత్త రెవెన్యూ డివిజనల్ కార్యాలయం ప్రారంభించి వస్తున్న మంత్రి సీదిరి అప్పలరాజు వాహనాన్ని ప్రజలు అడ్డుకున్నారు. కౌలు రైతులుగా తమ ఆధీనంలో ఉన్న భూములకు బినామీ రైతుల పేర్లతో పట్టాలు ఇవ్వడంపై స్థానికులు మండిపడ్డారు.

Minister Appalaraju
పలాసలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం

By

Published : Apr 4, 2022, 8:01 PM IST

Minister Appalaraju: శ్రీకాకుళం జిల్లా పలాసలో మంత్రి సీదిరి అప్పలరాజుకు నిరసన సెగ తగిలింది. రెవెన్యూ డివిజన్ కార్యాలయం ప్రారంభించి అక్కడి నుంచి బయల్దేరిన మంత్రి వాహనాన్ని పలాస మండలం కంబ్రిగాం గ్రామ ప్రజలు అడ్డుకున్నారు. కౌలు రైతులుగా తమ ఆధీనంలో ఉన్న భూములకు.. బినామీ రైతుల పేర్లతో పట్టాలు ఇచ్చారంటూ మండిపడ్డారు. తహసీల్దార్ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఇచ్చిన పట్టాలు వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సమస్య పరిష్కరిస్తామన్న మంత్రి అప్పలరాజు హామీతో శాంతించారు.

పలాసలో మంత్రి అప్పలరాజుకు చేదు అనుభవం

ABOUT THE AUTHOR

...view details