సీఎంకు వ్యతిరేక నినాదాలు చేసి అరెస్టైన శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణమూర్తికి బెయిల్ మంజూరైంది. ముఖ్యమంత్రి జగన్పై అనుచిత నినాదాలు చేశారంటూ, పోలీసులు వెంకటరమణమూర్తితోపాటు మరో 19 మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అనంతరం వెంకటరమణమూర్తికి స్థానిక ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించిన తర్వాత కొత్తూరు కోర్టులో హాజరుపరచగా, కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
పాతపట్నంలో అరెస్టైన తెదేపా నేతలకు బెయిల్ - శ్రీకాకుళం లేటెస్ట్ న్యూస్
సిఎం డౌన్ డౌన్..అంటు నినాదాలు చేశారంటూ, నిన్న అరెస్టు అయిన మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ సహా 19 మంది తెదేపా నేతలకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

మాతలలో అరెస్ట్ అయిన తెదేపా నేతలకు బెయిల్
Last Updated : Oct 18, 2019, 11:58 PM IST