ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 13, 2021, 6:07 PM IST

ETV Bharat / state

శ్రీకాకుళంలో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో పంచాయతీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని గ్రామపంచాయతీల్లో సర్పంచ్​ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ముమ్మరంగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ సారి తమకు అవకాశం ఇవ్వాలని ఓటర్లను వేడుకుంటున్నారు.

Panchayat election campaign in full swing in Srikakulam district amudalavalasa
శ్రీకాకుళంలో జోరుగా పంచాయతీ ఎన్నికల ప్రచారం

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలంలోని పలు గ్రామ పంచాయతీ పరిధిలో సర్పంచ్ అభ్యర్థుల ప్రచారం జోరుగా సాగుతోంది. మండలంలోని 30 పంచాయతీల్లో వైకాపా, తెదేపా, స్వతంత్ర అభ్యర్థులు పోటాపోటీగా ప్రచార కార్యక్రమాలు చేపడుతున్నారు.

సర్పంచ్​ పదవికి పోటీ చేసే అభ్యర్థులు ఇంటింటికి వెళ్లి తమకు ఓటు వేయాల్సిందిగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:పథకం ప్రకారం భర్త హత్య.. గొడవలో బయటపడ్డ నిజం

ABOUT THE AUTHOR

...view details