ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పలాస - కాశీబుగ్గ మున్సిపల్‌ ఛైర్మన్ గిరిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు - కాశీబుగ్గ ఛైర్మన్​ ఫోన్​ కాల్ తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పలాస-కాశీబుగ్గ మున్సిపల్‌ ఛైర్మన్ గిరిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. 24వ వార్డులో తెదేపాను గెలిపించిన ఆ వార్డు ప్రజలను బెదిరిస్తూ వ్యాఖ్యలు చేశారు. వైకాపా మున్సిపల్‌ ఛైర్మన్‌ ఆడియో సంభాషణలు స్థానికంగా కలకలం రేపుతున్నాయి. తెదేపాను గెలిపించినందుకు ఆ వార్డులో సంక్షేమ పథకాలు ఆపేస్తామని బెదిరించారు.

palasa municipal chairman voice viral
palasa municipal chairman voice viral

By

Published : Mar 22, 2021, 7:34 PM IST

శ్రీకాకుళం జిల్లా పలాస - కాశీబుగ్గ పురపాలిక సంఘం ఛైర్మన్‌ బళ్ల గిరిబాబు వ్యాఖ్యలు హల్‌చల్‌ చేస్తున్నాయి. 24వ వార్డులో తెదేపా విజయం సాధించటంతో.. వైకాపాకు ఓట్లేయలేదని సంక్షేమ పథకాలను ఆపేస్తునట్లు ఛైర్మన్‌ గిరిబాబు ఫోన్‌లో చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి.

పలాస - కాశీబుగ్గ మున్సిపల్‌ ఛైర్మన్ గిరిబాబు వివాదాస్పద వ్యాఖ్యలు

24వ వార్డుకు సంబంధించిన కొంతమంది జగనన్న విద్యాదీవెన పథకానికి ధరఖాస్తు చేసే క్రమంలో.. వాలంట్లీర్లు సంతకం పెట్టడంలేదని బాధితులు వాపోయారు. ఛైర్మన్‌ బళ్ల గిరిబాబుకు ఫిర్యాదు చేయగా.. తానే సంక్షేమ పథకాలను ఆపేయమని చెప్పినట్లు తెలిపారు. దీంతో బాధితులు పురపాలిక సంఘం కార్యాలయం వద్ద బైఠాయించారు. కమిషనర్‌ సెలవులో ఉన్నందున ఎవరికి చెపాలో తెలియక.. బాధితులంతా మీడియాను అశ్రయించారు.

బాధితుల ఫిర్యాదు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details