ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

తెదేపా కార్యకర్తలకు ఎంపీ రామ్మోహన్ నాయుడు దిశానిర్దేశం - mp rammohan naidu meeting with party men at achennaidu house in nimmada

శ్రీకాకుళం జిల్లా నిమ్మాడలోని అచ్చెన్నాయుడు ఇంటివద్ద.. తెదేపా శ్రేణులతో ఎంపీ రామ్మోహన్ నాయుడు సమావేశమయ్యారు. అక్రమ కేసులకు భయపడొద్దని, ప్రజల్లోకి వెళ్లి ప్రచారంలో పాల్గొనాలని ధైర్యం చెప్పారు. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే తన దృష్టికి తీసుకురావాలని సూచించారు.

mp rammohan naidu met with party men at nimmada
నిమ్మాడలో తెదేపా కార్యకర్తలతో ఎంపీ రామ్మోహన్ నాయుడు సమావేశం

By

Published : Feb 4, 2021, 6:37 PM IST

తెదేపా కార్యకర్తలు అధైర్యపడొద్దని.. శ్రీకాకుళం పార్లమెంట్ సభ్యులు కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. నిమ్మాడలోని ఆయన బంధువు అచ్చెన్నాయుడు ఇంటి వద్ద.. పలువురు నాయకులతో సమావేశం నిర్వహించారు.

ప్రజల్లోకి వెళ్లి ఎన్నికల ప్రచారం ప్రారంభించాలని.. అక్రమ కేసులకు భయపడొద్దని పార్టీ శ్రేణులకు ఎంపీ దిశానిర్దేశం చేశారు. ఎటువంటి ఇబ్బందులు ఎదురైనా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. అన్ని విషయాల్లో కార్యకర్తలకు అండగా నిలుస్తానని భరోసా ఇచ్చారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details