ఆంధ్రప్రదేశ్

andhra pradesh

అటు పోలింగ్.. ఇటు నగదు పంపిణీ!

By

Published : Feb 17, 2021, 3:15 PM IST

ఓ వైపు పంచాయతీ పంచాయతీ మూడో దశ ఎన్నికలు జరుగుతూనే ఉంటే... మరోవైపు ఓ అభ్యర్థి బంధువులు నగదు పంపిణీ చేశారు. పోలింగ్ కేంద్రానికి అత్యంత సమీపంలో... ఓటర్లను ఆకట్టుకునేందుకు డబ్బులు పంచారు. ఈ ఘటన.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరులో జరిగింది.

money  distributing at polling center at nadikuru in srikakulam district
యథేచ్ఛగా నగదు పంపిణీ.

యథేచ్ఛగా నగదు పంపిణీ

పంచాయతీ ఎన్నికల మూడో దశ పోలింగ్​లో భాగంగా.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం నడుకూరులో.. ఓ అభ్యర్థి సంబంధికులు యథేచ్ఛగా నగదు పంపిణీ చేశారు. ఓటర్లను ప్రలోభపెట్టేందుకు బహిరంగంగా ప్రయత్నించారు.

ఇంత జరుగుతున్నా.. ఈ దందాను మాత్రం ఎవరూ అడ్డుకోలేదు. పోలీసులు, ఎన్నికల సిబ్బంది సైతం పట్టించుకోలేందు. ఇదే అదనుగా.. ఓటర్లను అడ్డుకుంటూ.. వారిని మధ్యలోపే ఆపుతూ.. డబ్బులు పంచేందుకు సదరు అభ్యర్థి బంధువులు ప్రయత్నించారు.

ABOUT THE AUTHOR

...view details