భావనపాడు పోర్టును త్వరలోనే పూర్తి చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టిందని మంత్రి సిదిరి అప్పలరాజు తెలిపారు. శ్రీకాకుళం కలెక్టరేట్లో మీడియాతో మాట్లాడిన మంత్రి... భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని చెప్పారు. పోర్టు డీపీఆర్ను రైట్స్ సంస్థ తయారు చేసిందని తెలిపారు. 2,217 ఎకరాల్లో పోర్టు నిర్మాణం చేపడుతున్నట్లు వివరించారు. బుడగట్లపాలెం వద్ద ఫిషింగ్ హార్బర్తో పాటు నువ్వులరేవు, మంచినీళ్లపేట వద్ద జెట్టీలు నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. మత్స్యకారుల వలసల నివారణకు తగిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.
భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుంది: మంత్రి అప్పలరాజు - భావనపాడు పోర్టు
భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుందని మంత్రి అప్పలరాజు తెలిపారు. త్వరలోనే పోర్టు నిర్మాణ పనులను పూర్తి చేస్తామని చెప్పారు.
![భావనపాడు పోర్టును ప్రభుత్వమే నిర్మిస్తుంది: మంత్రి అప్పలరాజు minister sidiri appalaraju](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8606268-356-8606268-1598706760907.jpg)
minister sidiri appalaraju