ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jul 20, 2021, 10:04 PM IST

ETV Bharat / state

రూ. 25 కోట్లతో రాష్ట్ర రహదారి విరస్తరణ పనులకు శంకుస్థాపన

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్​ కట్టుబడి ఉన్నారని మంత్రి సీదిరి అప్పలరాజు పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే గేట్ వద్ద రహదారి విస్తరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు.

Appalaraju laying for state road works
రహదారి విరస్తరణ పనులకు శంకుస్థాపన

ముఖ్యమంత్రి జగన్​... రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి సీదిరి అప్పలరాజు అన్నారు. శ్రీకాకుళం జిల్లా పూండి రైల్వే గేట్ వద్ద పూండి-పర్లాఖిమిడి రాష్ట్ర హైవే విస్తరణ కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు. రూ. 25 కోట్లతో నువ్వల రేవు నుంచి టెక్కలిపట్నం వరకు రహదారి విస్తరణ పనులు జరుగుతాయన్నారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజల సంక్షేమానికి ముఖ్యమంత్రి జగన్​ కట్టుబడి ఉన్నారని మంత్రి పేర్కొన్నారు. అందులో భాగంగానే.. రాష్ట్రంలో భవనాలు లేని పంచాయతీలకు రూ. కోటి రూపాయలు ముఖ్యమంత్రి మంజూరు చేశారని గుర్తుచేశారు.

ABOUT THE AUTHOR

...view details