ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం పని చేయండి: ఉప ముఖ్యమంత్రి

ప్రభుత్వ పథకాలను, సంక్షేమ కార్యక్రమాలను పేదలకు అందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ ఆదేశించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం కార్యక్రమాలను సత్వరం పూర్తి చేయాలని దిశానిర్దేశం చేశారు.

By

Published : Oct 10, 2020, 3:49 PM IST

dharmana krishna das
dharmana krishna das

పేదల కోసం చేపట్టిన సంక్షేమ కార్యక్రమాలను సకాలంలో పూర్తి చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అధికారులకు సూచించారు. నరసన్నపేట ఎంపీడీఓ కార్యాలయంలో కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ప్రభుత్వ ప్రాధాన్యతల ప్రకారం... కార్యక్రమాలను సత్వరం పూర్తి చేయాలన్నారు. రహదారులు, తాగునీరు సమస్యలు పరిష్కరించాలని చెప్పారు. స్పందన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు.

ABOUT THE AUTHOR

...view details