ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'తెదేపా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారులు'

By

Published : Jan 10, 2020, 11:50 PM IST

రాజధాని పేరుతో అమరావతిలో చంద్రబాబు నాయుడుతో పాటు తెదేపా నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని మంత్రి ధర్మాన కృష్ణదాస్ విమర్శించారు. సీఎం జగన్​ అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో కృషి చేస్తున్నట్లు తెలిపారు.

minister dharmana krishna das comments
ధర్మాన కృష్ణదాస్

చంద్రబాబుపై మంత్రి ధర్మాన విమర్శలు

ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చినప్పటికీ చంద్రబాబు నాయుడుకి బుద్ధి రాలేదన్నారు రాష్ట్ర రహదారులు భవనాల శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో ఓ ప్రైవేటు కార్యక్రమానికి హాజరైన ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్ని ప్రాంతాలను అభివృద్ధి చేయాలని కృషి చేస్తున్నారన్నారు. రాజధాని పేరుతో అమరావతి ప్రాంతంలో చంద్రబాబుతో పాటు తెలుగుదేశం నాయకులు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారని విమర్శించారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details