ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

బీసీలు మాతోనే: అచ్చెన్నాయుడు - YCP

బీసీల కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రతిపక్ష నేత జగన్​ తెలుసుకోవాలని... శాసనసభలో బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించామని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు.

మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు

By

Published : Feb 18, 2019, 8:07 PM IST

మాట్లాడుతున్న మంత్రి అచ్చెన్నాయుడు
బడుగు బలహీన వర్గాల ప్రజలు ఎప్పుడూ తెలుగుదేశం పార్టీతోనే ఉంటారన్న నమ్మకముందని మంత్రి అచ్చెన్నాయుడు విశ్వాసం వ్యక్తం చేశారు. శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన పార్టీ సమావేశంలో పాల్గొన్న మంత్రి... రాష్ట్ర ప్రభుత్వం బీసీల కోసం తీసుకొన్న నిర్ణయాలు తెలుసుకొని మాట్లాడాలని వైకాపా అదినేత జగన్​కు సూచించారు. ఇటీవలి శాసనసభ సమావేశాల్లోనే బీసీ సబ్‌ప్లాన్‌కు నిధులు కేటాయించిన విషయం గుర్తుచేశారు. 139 కులాలకు కొర్పొరేషన్లు ఏర్పాటు చేశామన్న అచ్చెన్నాయుడు... రూ.42 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు.

ABOUT THE AUTHOR

...view details