శ్రీకాకుళం జిల్లా రాజాం పట్టణానికి చెందిన మైక్రో ఆర్టిస్ట్ జగదీష్.. మరోసారి తన ప్రతిభ కనబర్చాడు. స్వాతంత్య్ర దినోత్సవం సంబర్భంగా దేశభక్తిని చాటుకున్నాడు. 0.100 మిల్లీ గ్రాముల తీగతో భారతదేశ చిత్రపటాన్ని రూపొందించి జౌరా అనిపించాడు. మధ్యలో శాంతి చిహ్నమైన పావురాన్ని తయారు చేసి.. దానికి జాతీయ జెండా రంగులను అద్దాడు. దీనిని తయారు చేయడానికి సుమారు 45 నిమిషాలు పట్టిందని ఆయన తెలిపారు. ఈయన గతంలోనూ పలు చిత్ర పటాలను తయారు చేశారు.
రాజాం మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభ.. సన్నని బంగారు తీగతో భారతదేశ చిత్రం - rajam latets news
శ్రీకాకుళం జిల్లాకు చెందిన మైక్రో ఆర్టిస్ట్ జగదీష్.. స్వాతంత్య్ర దినోత్సవం రోజున దేశంపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు. 0.100 మిల్లీ గ్రాముల బంగారు తీగతో సూక్ష్మ భారతదేశ చిత్రాన్ని రూపొందించాడు.
![రాజాం మైక్రో ఆర్టిస్ట్ ప్రతిభ.. సన్నని బంగారు తీగతో భారతదేశ చిత్రం micro artict made india map with gold wire in rajam srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-12777596-206-12777596-1629002866230.jpg)
micro artict made india map with gold wire in rajam srikakulam district