ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Oct 11, 2020, 6:46 PM IST

ETV Bharat / state

చేతబడి అనుమానం: వ్యక్తి హతం

చేతబడి చేస్తున్నాడనే నెపంతో ఓ వ్యక్తిని గ్రామస్తులు హత్య చేసిన ఘటన శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చేతబడి చేస్తున్నాడని వ్యక్తిని హత్య చేసిన గ్రామస్తులు
చేతబడి చేస్తున్నాడని వ్యక్తిని హత్య చేసిన గ్రామస్తులు

శ్రీకాకుళం జిల్లా కొత్తూరు మండలం పుల్లగూడ గ్రామంలో శనివారం రాత్రి వూయక నాయకమ్మ (45) అనే వ్యక్తిని గ్రామస్తులు హత్య చేశారు. చేతబడి చేస్తున్నాడనే అనుమానంతో అతడిని అంతమొందించారు.

అనంతరం గ్రామ శివారులో మృతదేహాన్ని కాల్చివేశారు. పోలీసులకు సమాచారం అందగా.. సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. వ్యవహారాన్ని దర్యాప్తు చేస్తున్నారు.

ఇదీ చదవండి

:

రాష్ట్రంలో కొత్తగా 5,653 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details