ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నదిలో మునిగి యువకుడు మృతి - శ్రీకాకులం జిల్లా వార్తలు

శ్రీకాకుళం జిల్లాలో విషాదం నెలకొంది. కీర్తిపురంకు చెందిన ఓ యువకుడు నదిలో దిగి మృత్యువాత పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

man death to overdrop to river in keerthipuram srikakulam district
నదిలో మునిగి యువకుడు మృతి

By

Published : Apr 30, 2020, 6:20 PM IST

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండలంలోని కీర్తిపురంకు చెందిన యువకుడు బహుదా నదిలో స్నానానికి దిగి మృతి చెందాడు. గ్రామానికి చెందిన నాను బాలజగదీష్ ఆటో డ్రైవర్​గా పనిచేస్తున్నాడు. స్నానం చేయడానికి నదిలో దిగిన జగదీష్​కు ఈత రాకపోవడంతో నదిలో మునిగి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది.

ABOUT THE AUTHOR

...view details