ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 11, 2021, 12:51 PM IST

ETV Bharat / state

పాతపట్నం వద్ద వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద వంతెనపై నుంచి దూకి వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. వ్యక్తి మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవటమే ఇందుకు కారణమని స్థానికులు చెబుతున్నారు.

Man commits suicide
వ్యక్తి ఆత్మహత్య

శ్రీకాకుళం జిల్లా పాతపట్నం వద్ద ఒడిశా సరిహద్దులో ఉన్న వంతెనపై నుంచి దూకి తారకేశ్వరరావు అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. అచ్చుతాపురం గ్రామానికి చెందిన తారకేశ్వరరావు మానసిక పరిస్థితి సరిగ్గా లేదు. దీంతో పాతపట్నం- పర్లాకిమిడి మధ్య ఉన్న వంతెనపై నుంచి దూకి బలవర్మణానికి పాల్పడ్డాడు. సరిహద్దు ప్రాంతం కావడంతో ఒడిశా పోలీసులు మృతదేహాన్ని తరలించి పోస్టుమార్టం నిర్వహిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details