ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద ఆరో రోజు లారీ డ్రైవర్ల ఆందోళన - Purushottapuram check post latest news update

ఆంధ్రా సరిహద్దు ప్రాంతం జాతీయ రహదారిపై అడ్డుకున్న ధాన్యం లారీలు అడుగు కూడా ముందుకు కదలలేదు. దీంతో పురుషోత్తపురం తనిఖీ కేంద్రం వద్ద ఆరో రోజు వాహనచోదకులు ఆందోళన చేపట్టారు.

Lorry drivers protest At Purushottapuram
ఆరో రోజు లారీ డ్రైవర్లు ఆందోళన

By

Published : Nov 13, 2020, 3:12 PM IST


శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మున్సిపాలిటీ పరిధి పురుషోత్తపురం చెక్​పోస్ట్ వద్ద లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. ఆంధ్రా సరిహద్దు ప్రాంతంలోని జాతీయ రహదారిపై ధాన్యం లోడుతో వస్తున్న లారీలను అధికారులు నిలిపివేశారు. రాష్ట్రంలోకి వచ్చేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో ఆరు రోజులుగా అక్కడే వాహనాలు నిలిచిపోయాయి. దీంతో వాహన చోదకులు ఆందోళనకు దిగారు. మరోపక్క ఈ విషయమై స్థానిక అధికార యంత్రాంగం ఉన్నతాధికారులకు నివేదిక పంపింది. అయినప్పటికీ ఫలితం లేకుండాపోయింది.

ABOUT THE AUTHOR

...view details