శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస ప్రభుత్వ కళాశాలలో ఏర్పాటు చేసిన మహిళా రుణ మేళాను... సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు. ముఖ్యమంత్రి జగన్ తన పాదయాత్రలో ఇచ్చిన హామీలన్నీ దశలవారీగా నేరవేరుస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా... ప్రభుత్వం ఏర్పడిన 3 నెలలకే 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చామన్నారు. గ్రామ వాలంటీర్లను, సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే... వారిపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. వారిపై నాన్ బెయిలబుల్ వారెంటు జారీ చేయాలని పోలీసులకు సూచించారు. ప్రభుత్వం మహిళలకు అధిక ప్రాధాన్యం ఇస్తుందన్నారు. మహిళలకు రుణాలు పంపిణీ చేశారు.
'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు' - ఆమదాలవలసలో సమావేశానికి తమ్మినేని హాజరు
ఆముదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో... మహిళా రుణమేళాను సభాపతి తమ్మినేని సీతారాం ప్రారంభించారు.
!['గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు' 'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్ బెయిలబుల్ వారెంటే'](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5194654-249-5194654-1574863139131.jpg)
'సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే నాన్ బెయిలబుల్ వారెంటే'
'గ్రామ సచివాలయ ఉద్యోగులను ఇబ్బంది పెడితే చర్యలు తప్పవు'
ఇదీ చదవండి :