శ్రీకాకుళం జిల్లా టెక్కలి పోలీసులు ఒడిశా రాష్ట్రం గొసాని నుంచి శ్రీకాకుళం తరలిస్తున్న రూ.80 వేల విలువైన మద్యాన్ని పట్టుకున్నారు. టెక్కలి సమీపంలో ద్విచక్ర వాహనాన్ని తనిఖీ చేస్తుండగా.. ఓ కారు యూ టర్న్ తీసుకుని వెనక్కి వెళ్లిపోవడాన్ని పోలీసులు గుర్తించి వెంబడించారు. నర్సింగపల్లి గ్రామం వద్ద వాహనాన్ని నిలిపి పరిశీలించగా 84 మద్యం సీసాలు లభ్యమయ్యాయి.
కారులో ఉన్న ముగ్గురు నిందితులను, వీరికి ఎస్కార్టుగా ద్విచక్ర వాహనం నడుపుతున్న వ్యక్తిని అరెస్ట్ చేశారు. కారు, ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేసినట్లు ఎస్సై గణేష్ తెలిపారు. ట్రైనీ డీఎస్పీ శ్రీలత, సీఐ నీలయ్య టెక్కలి పోలీస్ స్టేషన్కు చేరుకుని విచారణ చేపట్టారు. ఏపీలో మద్యం రేట్లు ఎక్కువగా వుండడం, ఒడిశాలో మద్యం రేట్లు తక్కువగా ఉండటం వల్ల అధిక లాభార్జన కోసం అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
అక్రమంగా బీర్ అమ్మకాలు ఇద్దరు అరెస్ట్