ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Jun 19, 2020, 9:29 AM IST

ETV Bharat / state

ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు నిరసన

ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు ఆలిండియా లాయర్​ అసోసియేషన్​ సభ్యులు బొడ్డేపల్లి మోహన్​రావు ఆధ్వర్యంలో గురువారం నిరసన చేపట్టారు. న్యాయవాదులకు ఇచ్చిన హామీలు ప్రభుత్వం అమలు చేయాలంటూ డిమాండ్​ చేశారు.

layers protest at amadalavalasa court
కోర్టు ముందు ఆందోళన చేపట్టిన న్యాయవాదులు

శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస కోర్టు వద్ద న్యాయవాదులు గురువారం నిరసన తెలిపారు. ఆలిండియా లాయర్​ అసోసియేషన్​ సభ్యులు బొడ్డేపల్లి మోహన్​రావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. కరోనా సమయంలో పేద న్యాయవాదులకు ప్రభుత్వం ఇస్తానన్న రూ. 10 వేల ఆర్థిక సహాయం ఇంతవరకు మంజూరు చేయలేదని మోహన్​రావు మండిపడ్డారు. న్యాయవాదులకు బ్యాంకుల ద్వారా వడ్డీలేని రుణాలు అందించాలని కోరారు. లా నేస్తం బకాయిలు తక్షమమే మంజూరు చేయాలని డిమాండ్​ చేశారు. అలాగే రూ.100 కోట్లు సంక్షేమ నిధి బర్​ అసోసియేషన్​కు జమ చయాలన్నారు. న్యాయస్థానంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని పేర్కొన్నారు.

కోర్టు ముందు ఆందోళన చేపట్టిన న్యాయవాదులు

ABOUT THE AUTHOR

...view details