ఆంధ్రప్రదేశ్

andhra pradesh

పాము కాటుతో మహిళ మృతి

By

Published : May 30, 2020, 10:47 PM IST

తమ ఆవును పొలం నుంచి తీసుకువస్తున్న సమయంలో పాము కాటుకు గురై మహంతి రమణమ్మ(35) మృతి చెందింది. ఈ ఘటన లావేరు మండలంలో చోటు చేసుకుంది. ఈమెకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు. తల్లి అకస్మాత్తుగా మరణించడం వల్ల చిన్నారులు కన్నీరుమున్నీరయ్యారు.

lady from  srikakulam district died due to snake bite in visakhapatnam
పాము కాటుతో మృతి చెందిన రమణమ్మ పాత చిత్రం

శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గం లావేరు మండలం రొంపివలస గ్రామానికి చెందిన మహంతి రమణమ్మ(35) అనే మహిళ పాముకాటు గురై మృతి చెందింది. ఈ నెల 22న పొలంలో ఉన్న ఆవును తీసుకువస్తున్న సమయంలో పాముకాటు వేసింది. శనివారం విశాఖపట్నంలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఇద్దరు చిన్న పిల్లలు తల్లి మృతి చెందడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. వారి రోదనలు చూసి గ్రామస్థులు కంటతడి పెడుతున్నారు. ప్రస్తుతం మృతురాలు పాఠశాల కమిటీ చైర్మన్​గా ఉన్నారు.

పాము కాటుతో మృతి చెందిన రమణమ్మ పాత చిత్రం

ABOUT THE AUTHOR

...view details