ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు' - 'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు'

రమేష్‌కుమార్‌ కేసులో హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందని తెదేపా నేత కూన రవికుమార్ వ్యాఖ్యానించారు. జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదన్నారు.

'జగన్ ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకం లేదు'

By

Published : May 29, 2020, 8:59 PM IST

జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి రాజ్యాంగ వ్యవస్థలపై నమ్మకంలేదని తెదేపా నేత కూన రవికుమార్ మండిపడ్డారు. శ్రీకాకుళం జిల్లా తెదేపా కార్యాలయంలో సమావేశం నిర్వహించిన ఆయన.. రమేష్‌కుమార్‌పై హైకోర్టు ఇచ్చిన తీర్పు చరిత్రలో నిలిచిపోతుందన్నారు. రాజ్యాంగ వ్యవస్థలపై ఏ మాత్రం నమ్మకం ఉన్నా ముఖ్యమంత్రి, సభాపతి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కోర్టు తీర్పు జగన్మోహన్‌రెడ్డికి చెంపపెట్టులాంటిదన్నారు. వైకాపా ఏడాది పాలనలో రాజ్యాంగ వ్యవస్థలను పలుమార్లు తూట్లు పొడిచారని ఆరోపించారు.

ABOUT THE AUTHOR

...view details