శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్ట సమీప వ్యవసాయ బావిలో భారీ కొండచిలువ హల్ చల్ చేసింది. కొండచిలువను గ్రామస్థులు గుర్తించి... ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. గ్రీన్ మెర్సీ రెస్క్యూ టీం, అటవీశాఖ సిబ్బందితో కలసి అక్కడకు చేరుకున్నారు. గ్రీన్ మెర్సీ సంస్థ ప్రతినిధి రమణమూర్తి చాకచక్యంగా ఆ పాముని బావి నుంచి బయటకు తీశారు.
వ్యవసాయ బావిలో కొండచిలువ.. పట్టుకున్న అధికారులు - వ్యవసాయ బావిలో పాము
శ్రీకాకుళం జిల్లా పొందూరు మండలం కనిమెట్టలో వ్యవసాయ బావిలో కొండచిలువను గుర్తించారు. ఈ విషయాన్ని గ్రీన్ మెర్సీ సంస్థ జంతు సంరక్షణ గస్తీ విభాగానికి, అటవీ శాఖకి తెలియజేశారు. అధికారులు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
![వ్యవసాయ బావిలో కొండచిలువ.. పట్టుకున్న అధికారులు kondachiluva in well at srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8685507-486-8685507-1599283203878.jpg)
kondachiluva in well at srikakulam district
అనంతరం గ్రామస్థులకు పాములపై రమణమూర్తి అవగాహన కల్పించారు. పాములను కాపాడవలసిన ఆవశ్యకత వివరించారు. అనంతరం ఆ పాముని జిల్లా అటవీ శాఖ కార్యాలయానికి తరలించారు. డీఎఫ్ఓ సందీప్ కృపాకర్ సూచన మేరకు ఆ పాముని సమీప అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టారు.
ఇదీ చదవండి: చికిత్సకు వెళ్లడంలో జాప్యంతోనే కొవిడ్ మరణాలు!