ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శాకాంబరిగా భక్తులకు కాశీ అన్నపూర్ణేశ్వరి దర్శనం - kashi visweswara temple latest news update

ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా శ్రీకాకుళం జిల్లా పాలకొండ కాశీవిశ్వేశ్వర ఆలయంలో కాశీ అన్నపూర్ణాదేవిని కూరగాయలతో అలంకరించారు. ఆలయ ప్రధాన అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించగా.. భక్తులకు శాకాంబరిగా అమ్మవారు దర్శనమిచ్చారు.

Kashi Annapurna
శాఖంబరిగా భక్తులకు దర్శనమించిన కాశీ అన్నపూర్ణ

By

Published : Jul 20, 2020, 10:30 PM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండలో కాశీవిశ్వేశ్వర స్వామి ఆలయంలో కాశీ అన్నపూర్ణా దేవి భక్తులకు శాకాంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢ మాసం ముగింపు సందర్భంగా అమ్మవారికి 100 కిలోల కూరగాయలు, పండ్లను అర్చకులు అలంకరించారు.

ఆలయ ప్రధాన అర్చకులు ఆంజనేయశర్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారి అలంకరణ భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

ABOUT THE AUTHOR

...view details