ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఫార్మాసిస్టుల భర్తీ మెరిట్ జాబితాపై నివేదిక కోరిన జేసీ - జిల్లాలో ఫార్మాసిస్టుల భర్తీ మెరిట్ జాబితాపై నివేదిక కోరిన జెసి

శ్రీకాకుళం జిల్లా వైద్య ఆరోగ్యశాఖలో ఫార్మాసిస్టుల ఉద్యోగాల భర్తీలో పలు అవకతవకలు జరిగాయని, కొందరు అధికారులు వారికి అనుకూలమైన వ్యక్తులకు ఉద్యోగం వచ్చేలా ప్రతిభ జాబితా తయారుచేశారంటూ బాధిత అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. అనర్హులకు నియామక పత్రాలు అందజేశారని, కనీస సర్వీసు లేని వారికి ఉన్నట్లు చూపిస్తూ మార్కులు కలిపి జాబితాలో చోటు కల్పించి తమకు అన్యాయం చేశారని ఆవేదన చెందుతున్నారు. వారంతా ఉన్నతాధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఈ ఆరోపణలన్నిటిపై జాయింట్‌ కలెక్టర్‌ (అభివృద్ధి) శ్రీనివాసులు విచారణ చేపట్టారు. సమగ్ర నివేదిక తయారు చేసి తన ముందు ఉంచాలని ఆ శాఖ అధికారులను ఆదేశించారు.

JC seeking report on placement merit list of pharmacists in the district
జిల్లాలో ఫార్మాసిస్టుల భర్తీ మెరిట్ జాబితాపై నివేదిక కోరిన జెసి

By

Published : Oct 7, 2020, 2:11 PM IST

జూన్‌ 2న శ్రీకాకుళం జిల్లాలో 17 ల్యాబ్‌ టెక్నీషియన్లు, 26 ఫార్మాసిస్ట్‌ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది వైద్యఆరోగ్య శాఖ. సెప్టెంబరులో నిర్వహించిన ల్యాబ్‌ టెక్నీషియన్ల కౌన్సెలింగ్‌లో ఒకటో నంబరులో ఉన్న ఓ మహిళ పేరును ఏడో నంబరులో చేర్చడంతో ఆమె కోరుకున్న చోట పోస్టింగ్‌ దక్కించుకోలేకపోయింది. దీంతో ఆమె అప్పటి జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి అనురాధను సంప్రదించింది. రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ ప్రకారం మొదటి స్థానానికి వచ్చిన అభ్యర్థికి తొలి అవకాశం వచ్చిందని స్పష్టం చేశారు.

అదే ప్రకటనలో ఫార్మాసిస్టుల మొదటి ప్రతిభ జాబితాలో 26వ స్థానంలో ఉన్న ఒక మహిళ పేరు రెండో జాబితా వచ్చేసరికి ఏకంగా 69వ స్థానానికి వెళ్లిపోవడంతో ఆమె ఉద్యోగం కోల్పోయారు. బాధిత మహిళ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, ఉన్నతాధికారులను ఆశ్రయించినా ఫలితం లేకపోయింది. చివరికి ఆమె ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేశారు. విశ్వవిద్యాలయాలు మంజూరు చేసే మార్కుల జాబితాల్లో విద్యార్థుల మార్కులను సీజీపీఏగా ఇస్తారు. వాటి ఆధారంగా తీసుకుంటే ఇంకొందరికి జాబితాలో చోటు దక్కేది. కాని అధికారులు ఆల్‌ ఇండియా కౌన్సిల్‌ ఫర్‌ టెక్నికల్‌ ఎడ్యుకేషన్‌ (ఏఐసీటీఈ) నిబంధనల ప్రకారం చేశామని చెప్పడంతో తమకు అన్యాయం జరిగిందని బాధితులు ఆవేదన చెందుతున్నారు. ఇతర జిల్లాల్లో ఈ విధానం లేకపోయినా ఇక్కడ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు.

వైద్య విధాన పరిషత్తులోనూ..

వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలో ఈ ఏడాది నిర్వహించిన ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో పోస్టుల భర్తీలోనూ ఇలాంటి ఇబ్బందే తలెత్తడంతో నేటికీ అవి భర్తీ కాలేదు. అన్ని అర్హతలు ఉన్న ప్రతిభావంతులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. 20 ఎఫ్‌ఎన్‌వో, ఎంఎన్‌వో పోస్టులకు జులైలో ప్రకటన విడుదల చేశారు. మొత్తం 1,300 దరఖాస్తులు రాగా ప్రతిభ ఆధారంగా 60 మందిని ఎంపిక చేశారు. వీరందరికీ ఆగస్టు 18న శ్రీకాకుళం గ్రామీణ మండలం రాగోలులో జిల్లా ఆసుపత్రుల సమన్వయాధికారి కౌన్సెలింగ్‌ నిర్వహించి 15 మందికి ఆయా ప్రాంతాలను కేటాయించారు. 19న స్థానిక డీఎంహెచ్‌వో కార్యాలయానికి వచ్చి నియామకపత్రాలు పొందాలని చెప్పడంతో వారంతా ఆనందించారు. ఇంతలో సాంకేతిక కారణాల వల్ల నియామకపత్రాలు ఇవ్వలేమని, ఎప్పుడు ఇచ్చేదీ చెబుతామని అభ్యర్థులకు సంక్షిప్త సందేశం పంపడంతో నిరాశ చెందారు. ఎంపికైన ఆ 15 మంది అభ్యర్థులు నేటికీ డీఎంహెచ్‌వో, డీసీహెచ్‌ఎస్‌, కలెక్టర్‌ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా ఫలితం లేకపోయింది.

ఇవీ చదవండి: శ్రీకాకుళం జిల్లాలో వైఎస్​ఆర్​​ విగ్రహం ధ్వంసం

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details