ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

వెంటనే ఆక్రమణలను తొలగించండి: ఐటీడీఏ పీఓ సీహెచ్ శ్రీధర్ - రోడ్డు ఆక్రమణలు తాజావార్తలు

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను వెంటనే తొలగించాలని అధికారులను సీతంపేట ఐటీడీఏ పీఓ సీహెచ్ శ్రీధర్ ఆదేశించారు. ప్రధాన రహదారి పొడవునా ఆక్రమణలు ఉండటంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

itda po
ఐటీడీఏ పీఓ సీహెచ్ శ్రీధర్ తనిఖీలు

By

Published : Jul 14, 2021, 5:14 PM IST

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండల కేంద్రంలో రోడ్డుకు ఇరువైపులా ఉన్న ఆక్రమణలను గురువారంలోపు తొలగించాలని అధికారులను సీతంపేట ఐటీడీఏ పీఓ సీహెచ్ శ్రీధర్ ఆదేశించారు. మండల కేంద్రంలో ఆక్రమణకు గురైన రోడ్డు ప్రాంతాలను బుధవారం ఆయన పరిశీలించారు. ప్రధాన రహదారి పొడవునా ఆక్రమణలు ఉండడం గుర్తించామన్నారు. తక్షణమే ఆక్రమణలు తొలగించకపోతే జరిమానా విధిస్తామని హెచ్చరించారు.

రహదారుల పైన తోపుడు బండ్లు ఉండకూడదని సూచించారు. ఆక్రమణల కారణంగా అంతర్రాష్ట్ర రహదారిగా ఉన్న ప్రధాన రహదారి ఇరుకుగా మారిందని అన్నారు. పలుమార్లు రోడ్డు మార్గాలు ఆక్రమణలకు గురయయ్యాయని ఫిర్యాదులో రావడంతో ఎట్టకేలకు స్పందించిన పీఓ ఆక్రమణల తొలగింపునకు శ్రీకారం చుట్టారు.

ABOUT THE AUTHOR

...view details