ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల తనిఖీలు.. సరైన పత్రాలు లేని వాహనాలు స్వాధీనం

శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురంలో పోలీసులు ఆకస్మిక తనిఖీలు చేశారు. 400 ఇళ్లలో చేసిన తనిఖీల్లో పత్రాలులేని 23 ద్విచక్ర వాహనాలను గుర్తించారు.

By

Published : Aug 2, 2019, 3:29 PM IST

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు

తనిఖీల్లో స్వాధీనం చేసుకున్న ద్విచక్రవాహనాలు

శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురంలో ఎస్పీ అమ్మిరెడ్డి ఆదేశాల మేరకు కాశీబుగ్గ డీఎస్పీ శివరామిరెడ్డి ఆధ్వర్యంలో బేలుపాడ కాలనీలో 400 ఇళ్లలో తనిఖీలు చేపట్టారు. టాస్క్ ఫోర్స్ బృందాలు 50 మందితో ఇచ్చాపురం మున్సిపాలిటీలో తనిఖీలు నిర్వహించారు. సరైన పత్రాలు లేని 23 ద్విచక్ర వాహనాలను పోలీసులు గుర్తించారు. అనంతరం ఏఎస్​పేటలో గల పాత ట్రాన్స్ పోర్ట్ కార్యాలయాల్లో నిషేధిత పదార్థాలైన కైనీ, గుట్కా వంటి నిల్వలు ఉన్నాయనే అనుమానంతో తనిఖీలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details