ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Apr 29, 2020, 3:54 PM IST

ETV Bharat / state

ఇచ్ఛాపురం ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష

పలు డిమాండ్ల పరిష్కారం కోరుతూ శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే నిరాహార దీక్ష చేపట్టారు. కరోనా వైరస్ వ్యాప్తిని నివారించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు.

ichapuram MLA hunger strike for implement demonds
ఇచ్చాపురం ఎమ్మెల్యే 12 గంటల నిరాహార దీక్ష

లాక్​డౌన్​లో అత్యవసర సేవలందిస్తున్న సిబ్బందికి రక్షణ పరికరాలను ఇవ్వాలని కోరుతూ.. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం ఎమ్మెల్యే బెందాళం అశోక్ 12 గంటల నిరాహార దీక్ష చేపట్టారు. ఉపాధి కోల్పోయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ప్రతి పేద కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు. మూసివేసిన ఉన్న క్యాంటీన్​లను తెరిపించి, చంద్రన్న బీమా పథకాన్ని పునరుద్ధరించాలని కోరారు. ధాన్యం, పత్తి, మిర్చి పంటలను కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. వైరస్ వ్యాప్తి నివారణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.

ABOUT THE AUTHOR

...view details