ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలి: ఎమ్మెల్యే అశోక్ - mla ashok speech on farmers at ichapuram

శ్రీకాకుళం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. అన్నదాత పరిస్థితి ఘోరంగా తయారైంది. అధికారులు, ప్రజాప్రతినిధులు ముంపు ప్రాంతాలను పరిశీలిస్తున్నారు. ఇచ్చాపురం నియోజకవర్గంలో వానలకు పంటలు దెబ్బతిన్న వివిధ గ్రామాల్లో ఎమ్మెల్యే అశోక్ పర్యటించారు. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

ichapuram crops
నీట మునిగిన ఇచ్చాపురం పంటలు

By

Published : Oct 15, 2020, 6:08 PM IST

ముంపు ప్రాంతాన్ని ఇళ్ల పట్టాలు ఇవ్వడం కోసం ఏర్పాటు చేయడంపై ఇచ్చాపురం ఎమ్మెల్యే అశోక్ మండిపడ్డారు. పేదలకు ఏ విధంగా న్యాయం చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. శ్రీకాకుళం జిల్లాలోని ధర్మపురం, డొంకూరు తదితర గ్రామాలలో ఆయన పర్యటించారు. వరి పంట పూర్తిగా నాశనమైందనీ.. రైతులను ప్రభుత్వమే ఆదుకోవాలని డిమాండ్ చేశారు. స్థానికులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. పల్లెల్లో కొరవడిన పారిశుద్ధ్యాన్ని పునరుద్ధరించడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఎమ్మెల్యే అశోక్ పర్యటన

మూడు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఇచ్చాపురం నియోజకవర్గంలోని లోతట్టు ప్రాంతాలు నీటమునిగాయి. పంటలు నాశనమయ్యాయి. వాగులు, వంకలు పొంగుతూ ఉండటంతో రోడ్లపై నీరు నిలిచిపోయింది.

ఇదీ చదవండి:'వైఎస్సార్ ఉచిత విద్యుత్ పథకానికి శ్రీకాకుళం నుంచే శ్రీకారం'

ABOUT THE AUTHOR

...view details