ETV Bharat Andhra Pradesh

ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అగ్ని ప్రమాదంలో గడ్డివాములు దగ్ధం - పాలకొండ మండలం తాజా వార్తలు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరంలో అగ్ని ప్రమాదం జరిగింది. రెండు గడ్డివాములు పూర్తిగా దగ్ధం అయ్యాయి. సుమారు 50 వేల రూపాయలకు పైగా నష్టం వాటిల్లిందని బాధిత రైతులు తెలిపారు.

అగ్నిప్రమాదంలో గడ్డివాములు దగ్ధం
అగ్నిప్రమాదంలో గడ్డివాములు దగ్ధం
author img

By

Published : Mar 2, 2021, 9:23 AM IST

దగ్దమవుతున్న గడ్డివాములు

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం అన్నవరం గ్రామంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో గ్రామ సమీపంలోని రాగోలు కృష్ణ, బొత్స ఆదినారాయణకు చెందిన పంట పొలాల్లో గడ్డివాములు అగ్నికి ఆహుతయ్యాయి.

ప్రమాదం సమాచారం అందుకున్న అగ్ని మాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకునేసరికే.. గడ్డివాములు దగ్ధం అయ్యాయి. సుమారు 50 వేల రూపాయలు విలువ చేసే పశుగ్రాసం కాలి బూడిదైనట్లు బాధితులు తెలిపారు. ప్రమాదానికి కారణాలు తెలిసిరాలేదు.

ABOUT THE AUTHOR

...view details