ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అధికారులు, గ్రామస్థుల మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు - old woman funeral news

వృద్ధాప్యంతో తల్లి కన్నుమూసింది. మతిస్థిమితం లేని కుమార్తె దీనంగా చూడడం తప్ప ఏమీ చేయలేకపోయింది. ఈ క్రమంలో అధికారులే అండగా నిలిచి వృద్ధురాలి మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టంలో జరిగిన ఘటన వివరాలివి..!

అధికారులు, గ్రామస్థుల మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు
అధికారులు, గ్రామస్థుల మానవత్వం.. అనాథ వృద్ధురాలికి అంత్యక్రియలు

By

Published : Aug 5, 2020, 12:24 AM IST

శ్రీకాకుళం జిల్లా పాలకొండ మండలం తంపటపల్లి గ్రామానికి చెందిన సరస్వతి, భాగ్యలక్ష్మి తల్లీకూతుళ్లు. వీరికి ఎవరూ లేకపోవడం వల్ల బతుకుదెరువు కోసం వీరఘట్టం మండలం కంబరవలస వెళ్లిపోయారు. స్థానిక ప్రభుత్వ పాఠశాలే వీరికి దిక్కయింది. ఈ క్రమంలో వృద్ధాప్యంతో తల్లి సరస్వతి మృతి చెందింది. మతిస్థిమితం సరిగా లేని కుమార్తె భాగ్యలక్ష్మి ఏమీ చేయలేని స్థితిలో ఉండిపోయింది. విషయం తెలుసుకున్న గ్రామ వీఆర్వో సురేష్​, కానిస్టేబుల్​ అశోక్​, కొందరు గ్రామస్థులు వృద్ధురాలికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చారు.

ఎవరూ లేని వృద్ధురాలికి అయినవారుగా మారి అంత్యక్రియలు నిర్వహించారు. మతిస్థిమితం లేని భాగ్యలక్ష్మి ఒంటరిగా మిగిలిందని.. ఆమెను ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details