ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

దాతల దయాగుణం.. వలస కార్మికులకు అన్నదానం - శ్రీకాకుళం జిల్లాలో వలస కార్మికులు తాజా వార్తలు

లాక్ డౌన్ వేళ ఇబ్బందులు పడుతున్న వారికి సహాయం చేసేందుకు దాతలు ముందుకు వస్తున్నారు. ఎన్నో అవస్థలు పడుతూ.. మరెన్నో కష్టాలు ఎదుర్కొంటూ సొంత గ్రామాలకు నడిచి వెళుతున్న వలస కూలీలకు అన్నం పెడుతున్నారు.

food distribution to migrant labours in srikakulam district
వలస కార్మికులకు ఆహారం అందజేస్తున్న దాతలు

By

Published : May 23, 2020, 5:07 PM IST

శ్రీకాకుళం జిల్లా పాత్రునివలస గ్రామానికి చెందిన గణేష్, దాలి నాయుడు ఆధ్వర్యంలో వలసకూలీలకు ఆహార పొట్లాలు పంపిణీ చేశారు. వైకాపా నేత ధర్మాన రామ్ మనోహర్ నాయుడు చేతుల మీదుగా వారికి ఆహారం అందించారు.

జాతీయ రహదారిపై మండుటెండలో కాలినడకన స్వస్థలాలకు వెళ్తున్న వారికి అన్నం పెట్టి ఆదుకున్నారు. ఆహారం, మంచినీరు దొరక్క వలస కార్మికులు ఇబ్బంది పడుతున్నారని.. వారికి తమవంతు సాయం చేశామని దాతలు చెప్పారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details