శ్రీకాకుళంలో రెడ్క్రాస్ సంస్థ వేలాది నిరుపేదలకు ఆకలి తీరుస్తోంది. జిల్లా కలెక్టర్ నివాస్ దిశానిర్దేశం మేరకు.. కొంత మంది దాతల సహకారంతో రెడ్క్రాస్ ప్రతినిధులు పేదలకు భోజనాలు పంపిణీ చేశారు. అంతేకాకుండా... అక్షయపాత్ర ద్వారా 8 మండలాల్లో పది వేల మందికి రోజుకు రెండు పూటలు భోజనాలు సమకూరుస్తున్నామని స్టేట్ వైడ్ రెడ్క్రాస్ చైర్మన్ జగన్మోహనరావు చెప్పారు. పేదలతో పాటు నిరాశ్రయుల ఆకలిని తీర్చుతున్నామని చెప్పారు.
నిరుపేదల ఆకలి తీర్చుతున్న రెడ్క్రాస్ - శ్రీకాకుళం జిల్లా తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ నివాస్ దిశా నిర్దేశంతో.. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో వేలాది మందికి ఆకలి తీరుస్తున్నారు.
![నిరుపేదల ఆకలి తీర్చుతున్న రెడ్క్రాస్ food distribution by red cross organisation in srikakulam district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6790435-979-6790435-1586867133528.jpg)
పేదలకు భోజనాలు పంపిణీ చేస్తున్న రెడ్క్రాస్ సంస్థ