ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Feb 22, 2021, 4:16 PM IST

Updated : Feb 22, 2021, 4:23 PM IST

ETV Bharat / state

గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా గుగ్గిలి గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధమయ్యాయి. ఎంతో కష్టపడి పండించిన వరి పంటను బూడిదగా చూసిన ఆ రైతులు కన్నిరుమున్నీరుగా విలపిస్తున్నారు.

paddy piles burn in a fire incident
గుగ్గిలిలో ఐదు ఎకరాల వరి కుప్పలు దగ్ధం

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం గుగ్గిలి గ్రామంలో అదివారం అర్ధరాత్రి అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో తూలుగు లక్ష్మణరావు, ఎలమంచిలి రాజు అనే రైతులకు చెందిన ఐదు ఎకరాల వరి కుప్పలు కాలిపోయాయి. దీంతో ఆ రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

రాజకీయ కక్షతోనే గుర్తుతెలియని వ్యక్తులు ధాన్యం కుప్పలకు నిప్పంటించి ఉంటారని బాధితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఎంతో కష్టపడి పండించామని ఆవేదన వ్యక్తం చేశారు. తమను ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చూడండి:పరదా పట్టల కోసం ఇద్దరు మిత్రుల మధ్య ఘర్షణ.. కత్తితో దాడి

Last Updated : Feb 22, 2021, 4:23 PM IST

ABOUT THE AUTHOR

...view details