ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎరువులపైనే ఆరాటం.. ఏదీ భౌతిక దూరం? - నరసన్నపేటలో రైతుల క్యూ

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎరువుల కోసం రైతన్నలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గత మూడు రోజులుగా ఎరువుల కోసం క్యూలైన్లలో ఎదురుచూస్తున్నామని వాపోయారు. అక్కడ.. భౌతిక దూరం లోపించడంపై.. గ్రామస్థులు కంగారు పడుతున్నారు.

నరసన్నపేటలో రైతుల క్యూ

By

Published : Aug 20, 2020, 3:04 PM IST

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో ఎరువుల కోసం అన్నదాతలు అవస్థలు పడుతున్నారు. పీఎసీఎస్ కార్యాలయం వద్ద రైతులు బారులు తీరారు. కొంతమేర తోపులాటకు గురయ్యారు.

3 రోజులుగా ఎరువుల కోసం కార్యాలయం చుట్టూ తిరుగుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కానీ.. ఎరువులు లభ్యం కావడం లేదని చెప్పారు. అక్కడ భౌతిక దూరం పాటించకపోయేసరికి.. కరోనా వ్యాప్తి చెందుతుందని స్థానికులు ఆందోళన చెందుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details