ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Dec 14, 2020, 5:25 PM IST

ETV Bharat / state

వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా..శ్రీకాకుళం జిల్లాలో అఖిల భారత రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు.

Farmers unions protest in srikakulam against agricultural bills passed by central government
వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా రైతు సంఘాల నిరసన

అఖిల భారత రైతు, కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లాలో ధర్నా నిర్వహించారు. డే ఆండ్‌ నైట్‌ కూడలి నుంచి ఆదాయపు పన్ను కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టి.. రహదారిపై బైఠాయించి నిరసన చేపట్టారు.

దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న నిరసనలకు సంఘీభావం తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అన్ని పంటలకు కనీస మద్దతు ధరల గ్యారంటీ చట్టం చేయాలని డిమాండ్‌ చేశారు. కేరళ తరహా రైతు బుణ విమోచన చట్టం చేయాలని.. జీవో నెంబరు 22ను రద్దు చేయాలని కోరారు.

ABOUT THE AUTHOR

...view details