ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు - farmer demaded to revenue officer in srikakulam district thalildar

తెలంగాణాలోని తహసీల్దార్​పై జరిగిన దాడిని ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు త్వరితగతిన చేయించుకునేందుకు కొందరు ఉపయోగించుకుంటున్నారు. శ్రీకాకుళం జిల్లాలో ఓ అన్నదాత తనకు  రైతు భరోసా డబ్బు ఇంకా అందలేదంటూ ఏవోను బెదిరించాడు.

తహసీల్ధార్​ను బెదిరించిన రైతు...

By

Published : Nov 15, 2019, 3:02 PM IST

రైతు బెదిరించాడని వ్యవసాయ అధికారి ఫిర్యాదు

శ్రీకాకుళం జిల్లా పొందూరు తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న రైతు భరోసా గ్రీవెన్స్​లో ఓ రైతు హల్​చల్​ చేశాడు. దల్లలవలసకు చెందిన వెంకటరమణ అనే రైతు తనకు రైతు భరోసా నగదు ఇంకా అందలేదంటూ వ్యవసాయ అధికారిపై తిరగబడ్డాడు. డబ్బు కోసం ఎన్ని రోజులు తిప్పించుకుంటారని వారిపై అసహనం వ్యక్తం చేశాడు. తెలంగాణలో తహసీల్దార్​పై పెట్రోల్ పోసి తగలబెట్టినట్లు మిమ్మల్నీ చేయాలని బెదిరించాడు. దీనిపై ఆందోళన చెందిన అధికారులు జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి సూచన మేరకు ఏవో స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ABOUT THE AUTHOR

...view details