గ్రామంలో గజరాజులు.. ఆందోళనలో ప్రజలు - latest news of elephants in srikakulam dst
ఏనుగుల గుంపు.. గ్రామస్థులను భయభ్రాంతులకు గురిచేసిన ఘటన.. శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం కలకల గ్రామంలో జరిగింది. విజయనగరం జిల్లా నుంచి శ్రీకాకుళం జిల్లాలోకి ఏనుగులు ప్రవేశించాయి. అటవీశాఖ అధికారులు బాణాసంచా కాల్చి గజరాజులను భయపెట్టే ప్రయత్నం చేశారు. గ్రామంలోకి ఏనుగులు రావడాన్ని చూసిన ప్రజలు.. ఆందోళనకు గురయ్యారు.