శ్రీకాకుళం జిల్లా పాలకొండ కోటదుర్గమ్మ మహోత్సవాలు నిరాడంబరంగా ప్రారంభమయ్యాయి. స్థానిక సంప్రదాయం ప్రకారం బీరి కుటుంబసభ్యులు ముందస్తు పూజలు చేశారు ఆ తర్వాత అమ్మవారి నిజరూప దర్శనాలు ప్రారంభమయ్యాయి. పాలకొండ ఎమ్మెల్యే కళావతి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కరోనా కారణంగా అమ్మవారి దర్శనాలు రద్దు చేస్తున్నట్లు దేవాదాయ శాఖ అధికారులు ప్రకటించారు. దర్శనాల రద్దుపై భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
నిరాడంబరంగా కోట దుర్గమ్మ దసరా మహోత్సవాలు - శ్రీకాకుళంలో ప్రారంభమైన కోట దుర్గమ్మ దసరా మహోత్సవాలు
శ్రీకాకుళం జిల్లాలోని పాలకొండ కోటదుర్గమ్మ మహోత్సవాలు ఆలయాధికారులు నిరాడంబరంగా నిర్వహిస్తున్నారు. కొవిడ్ కారణంగా ఆలయాల్లో సామూహిక పూజలను అధికారులు నిషేధించగా... భక్తులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

నిరాడంబరంగా ప్రారంభమైన కోట దుర్గమ్మ దసరా మహోత్సవాలు