ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : May 11, 2020, 1:22 PM IST

ETV Bharat / state

నిబంధనలు పాటిస్తూ మద్యం కొనుగోళ్లు

కరోనా నేపథ్యంలో విధించిన లాక్​డౌన్​ నుంచి కేంద్ర ప్రభుత్వం కొన్ని నిబంధనలతో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. ఈ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం మద్యం దుకాణాలు ముందు బారులు తీరిన మందుబాబులు.. భౌతిక దూరాన్ని పాటించారు.

drinkers dicipline in srikakulam
నిబంధనలు పాటిస్తూనే మద్యం కొనుగోళ్లు

శ్రీకాకుళం జిల్లాలో ఆదివారం మద్యం కొనుగోలుకు మందుబాబులు బారులు తీరారు. భౌతిక దూరం, మాస్కు​ ఉంటేనే మద్యం అమ్మాలని దుకాణదారులను కలెక్టర్​ నివాస్​ ఆదేశించారు.

ఆ మేరకు విక్రేతలు తగిన ఏర్పాట్లు చేశారు. మద్యం కోసం మందుబాబులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. నిబంధనలు పాటించారు. మాస్కు వేసుకుని.. భౌతిక దూరాన్ని పాటిస్తూ మద్యం కొనుగోలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details