ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎన్​ఎంసీ బిల్లును రద్దు చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నాయి. శ్రీకాకుళం జిల్లాలో సర్వజన ఆసుపత్రి ఎదుట వైద్య విద్యార్దులతో కలసి డాక్టర్లు నిరసన చేపట్టారు.

By

Published : Jul 31, 2019, 8:59 PM IST

ఎన్​ఎంసీ బిల్లును రద్దు చేయాలని రోడ్డెక్కిన వైద్యులు

ఎన్​ఎంసీ బిల్లును రద్దు చేయాలని రోడ్డెక్కిన వైద్యులు

ఎన్​ఎంసీ బిల్లుకు వ్యతిరేకంగా వైద్య విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. ఇండియన్‌ మెడికల్‌ అసోసియేషన్‌ పిలుపు మేరకు సిక్కోలు వైద్యులు ప్రైవేటు ఆసుపత్రుల బంద్‌కు పిలుపునిచ్చారు. శ్రీకాకుళం సర్వజన ఆసుపత్రి ఎదుట వైద్యులు నిరసన చేశారు. ఉదయం 6 గంటల నుంచి రేపు ఉదయం 6 గంటల వరకు ప్రైవేట్ ఆసుపత్రుల బంద్​కు పిలుపునిచ్చారు. ప్రభుత్వ వైద్యులు గంటపాటు విధులకు హాజరుకావడం లేదని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ బిల్లు అమోదించడాన్ని వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details