ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Nov 6, 2020, 1:19 PM IST

ETV Bharat / state

శ్రీకాకుళం జిల్లాలో వైకాపా నాయకుల పాదయాత్ర

వైఎస్​ జగన్​ మోహన్​రెడ్డు పాదయాత్ర చేపట్టి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నరసన్నపేటలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వై.ఎస్​.రాజశేఖర్​రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి, నివాళులర్పించారు.

padayatra
శ్రీకాకుళంలో పాదయాత్ర

శ్రీకాకుళం జిల్లాలో ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పాదయాత్ర నిర్వహించారు. నరసన్నపేట సమీపంలోని పైడితల్లి ఆలయం నుంచి మారుతీనగర్ కూడలి వరకు పాదయాత్ర సాగింది. అనంతరం వైస్సార్​ విగ్రహానికి పూలమాల వేసి, నివాళులు అర్పించారు. నవరత్నాలు పథకం అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని కృష్ణదాస్ అన్నారు. ఈ కార్యక్రమంలో వైకాపా నాయకుడు ధర్మాన కృష్ణ చైతన్య, కార్యకర్తలు, శిష్టకరణం కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్.కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details