త్వరలోరాష్ట్రవ్యాప్తంగా భూసర్వే ప్రారంభిస్తున్నట్టు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ అన్నారు. శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతు గ్రామం వద్ద 26 కోట్లతో రహదారి పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. బ్రిటిష్ కాలం నాటి భూ రికార్డులు సవరించడం వల్ల ఎప్పుడూ భూవివాదాలు జరుగుతున్నాయన్నారు. ఈ కారణంగా 90 ఏళ్ల తర్వాత భూ రీసర్వే నిర్వహించేందుకు తమ ప్రభుత్వం నిర్ణయించిందన్నారు.
'రాష్ట్రంలో త్వరలో ప్రారంభం కానున్న భూసర్వే' - బొంతులో రహదారి పనులకు శంకుస్థాపన తాజా వార్తలు
శ్రీకాకుళం జిల్లా సారవకోట మండలం బొంతులో 26 కోట్లతో రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన చేశారు. త్వరలో ప్రభుత్వం భూసర్వే నిర్వహిస్తుందన్నారు.

రహదారి పనులకు ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ శంకుస్థాపన