కేంద్ర ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలపై నిరసన తెలుపుతూ శ్రీకాకుళంజిల్లా పాలకొండ నగర పంచాయతీలోని ఇందిరానగర్ సచివాలయం ఎదురుగా సిపిఎం నిరసన చేపట్టింది. లాక్ డౌన్ ప్రజల ప్రయోజనాల కంటే కార్పొరేట్ ప్రయోజనాలకే ఉపయోగపడే విధంగా మోదీ ప్రభుత్వం పనిచేస్తుందని విమర్శించారు.
నెలకు రూ.7500లు చొప్పున ప్రతి కుటుంబానికి 6 నెలలు కేంద్ర ప్రభుత్వం ఆర్ధిక సాయం, ప్రతి మనిషికి నెలకి 10 కిలోల చొప్పున 6 నెలలు బియ్యం సరఫరాతో పాటుగా సంవత్సరానికి 200 రోజులు ప్రతి కుటుంబానికి ఉపాధిహామీ పనిదినాలు కల్పించాలన్నారు.