ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

నిబంధనలు ఉల్లంఘిస్తే అపరాధ రుసుం: ఎస్పీ - srikakulam covid awarness programme news

శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కరోనా అవగాహన కార్యక్రమం నిర్వహచించారు. ఎస్పీ అమిత్​బర్దార్ పాల్గొన్నారు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామని చెప్పారు. హోలీ పండుగను నిరాండంబరంగా జరుపుకోవాలని కోరారు.

sp amith bardar
ఎస్పీ అమిత్ బర్దార్ తాజా వార్తలు

By

Published : Mar 28, 2021, 7:16 AM IST

కరోనా విషయంలో నిర్లక్ష్యం వద్దని ఎస్పీ అమిత్‌బర్దార్‌ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని డే అండ్‌ నైట్‌ కూడలిలో ప్రజలకు కొవిడ్‌పై అవగాహన కల్పించారు. మాస్కులు అందించారు. కొవిడ్‌ నిబంధనలు ఉల్లంఘించినవారి నుంచి అపరాధ రుసుం వసూలు చేస్తామన్నారు.

ప్రభుత్వం వ్యాక్సినేషన్‌ ప్రక్రియ వేగవంతం చేసిందన్నారు. అనంతరం కొవిడ్‌ నిబంధనలపై ప్రతిజ్ఞ చేయించారు. హోలీ పండుగ నిరాండంబరంగా జరుపుకోవాలని కోరారు. శ్రీకాకుళం డీఎస్పీ మహేంద్ర, ట్రాఫిక్‌ డీఎస్పీ ప్రసాదరావు, సీఐ వెంకటరమణ, ఎస్‌ఐ, తదితరులు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details