ఆంధ్రప్రదేశ్

andhra pradesh

By

Published : Mar 21, 2020, 9:57 AM IST

Updated : Mar 21, 2020, 11:38 AM IST

ETV Bharat / state

కుమార్తె సహా.. దంపతుల బలవన్మరణం

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొత్తపేటలో దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. అప్పులబాధతో శంకరరావు, కళావతి అనే దంపతులు పురుగులమందు తాగి.. అనంతరం తమ 9 ఏళ్ల కుమార్తెకు పట్టించారు. ముగ్గురూ మరణించారు.

couple suicide
couple suicide

కుమార్తెతో కలిసి ఆత్మహత్య చేసుకున్న దంపతులు

శ్రీకాకుళం జిల్లా జలుమూరు మండలం కొత్తపేటలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. కూలీగా పనిచేస్తూ కుటుంబాన్ని ఇన్నాళ్లూ నెట్టుకొచ్చిన చిగుళ్ల పల్లి శంకర్రావు , అతని భార్య కళావతి, పెద్ద కుమార్తె గీతాంజలి... అర్ధరాత్రి సమయంలో ఆత్మహత్యకు పాల్పడ్డారు. శంకర్రావు తల్లి దమయంతి , చిన్న కుమార్తె నిహారిక వేరే గదిలో నిద్రిస్తుండగా ముగ్గురూ పురుగుల మందు తాగాారు. తల్లి దమయంతి గమనించిన వెంటనే స్థానికులకు తెలిపింది. హుటాహుటిన ముగ్గురిని ఆసుపత్రికి తరలించినా లాభం లేకపోయింది.

Last Updated : Mar 21, 2020, 11:38 AM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details